శ్రీ శ్రీ పరమహంస యోగానంద రచనల నుండి సారాంశాలు
ఇతరుల హృదయాల నుండి అన్ని బాధలను దూరం చేసే సానుభూతి మీ హృదయంలో ఉండాలి, ఆ సానుభూతి ఏసు ఇలా చెప్పడానికి వీలు కల్పించింది: “తండ్రీ, వారిని క్షమించు; ఎందుకంటే వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు.” ఆయన మహోన్నతమైన ప్రేమ అందరినీ ఆవరించింది. ఆయన తన శత్రువులను ఒక్క చూపుతో నాశనం చేయగలడు. అయినా దేవుడు మన దుష్ట ఆలోచనలన్నీ తెలిసినప్పటికీ మనల్ని నిరంతరం క్షమిస్తున్నట్లుగా, అతనితో అనుసంధానమై ఉన్న మహాత్ములు మనకు అదే ప్రేమను ఇస్తారు.
మీరు క్రీస్తు చైతన్యాన్ని పెంపొందించుకోవాలంటే, సానుభూతితో ఉండడం నేర్చుకోండి. ఇతరుల పట్ల నిజమైన భావన మీ హృదయంలోకి వచ్చినప్పుడు, మీరు ఆ గొప్ప చైతన్యాన్ని వ్యక్త పరచడం ప్రారంభిస్తారు….శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: “మనుష్యులందరినీ సమ దృష్టితో చూసేవాడే అత్యున్నతమైన యోగి….”
కోపం మరియు ద్వేషం ఏమీ సాధించలేవు. ప్రేమ ప్రతిఫలమిస్తుంది. మీరు ఎవరినైనా దూషించవచ్చు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ లేచిన తర్వాత మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మీరు అతనిని ఎలా జయిస్తారు? మీరు జయించలేదు. జయించాలంటే ప్రేమ ఒక్కటే మార్గం. మరియు మీరు జయించలేని చోట, మౌనంగా ఉండండి లేదా దూరంగా ఉండండి మరియు అతని కోసం ప్రార్థించండి. మీరు ప్రేమించవలసిన మార్గం అదే. దీన్ని మీ జీవితంలో ఆచరిస్తే, అవగాహనకు అతీతమైన శాంతిని మీరు పొందుతారు.
ప్రతిజ్ఞ
ప్రతిజ్ఞ సిద్ధాంతం మరియు సూచనలు
“ఈ రోజు నన్ను బాధపెట్టిన వారందరినీ నేను క్షమిస్తాను. దాహంతో ఉన్న హృదయాలన్నిటికీ, నన్ను ప్రేమించేవారికి మరియు నన్ను ప్రేమించనివారికి కూడా నేను నా ప్రేమను అందిస్తాను.”