దేవునిలో మీ ఆనందాన్ని తప్ప నేను మీ నుండి ఏమీ కోరుకోను. దేవుని జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని తప్ప మీరు నా నుండి ఏమీ కోరుకోరు.
— పరమహంస యోగానంద
గురువు: “అంధకారాన్ని పారద్రోలేవాడు”
గురుశిష్యుల బంధం
పరమహంస యోగానందగారు గురుశిష్య సంబంధాన్ని ఈ విధంగా వర్ణించారు “చాలా వ్యక్తిగతమైన మరియు ఆంతరంగికమైన ఆధ్యాత్మిక బంధం… శిష్యుని పక్షాన నమ్మకమైన ఆధ్యాత్మిక ప్రయత్నం మరియు గురువు అందించే దివ్యమైన ఆశీర్వాదాల కలయిక.”
గురువు యొక్క విధేయతకు ప్రతిజ్ఞ చేయడం ద్వారా అతడు లేదా ఆమె తమ స్వీయ విధేయతను గురువుకు పరస్పరం వ్యక్తం చేస్తారు. వై.ఎస్.ఎస్. పాఠాల విద్యార్థిగా చేరిన వ్యక్తికి బాహ్యంగా లేదా అంతర్గతంగా అటువంటి వాగ్దానం చేయవలసిన అవసరం లేదు. పరమహంసగారు ధ్యానం యొక్క శక్తివంతమైన ప్రక్రియల జ్ఞానాన్ని—మతపరమైన అనుబంధం లేదా అభ్యాసాలతో సంబంధం లేకుండా—వాటిని చిత్తశుద్ధితో నేర్చుకోవాలనుకొని, ఆ జ్ఞానాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేసేవారికి ఉచితంగా అందించారు.
అయినప్పటికీ, క్రియాయోగ శాస్త్రాన్ని దేవుణ్ణి చేరే వ్యక్తిగత మార్గంగా భావించేవారికి, పరమహంస యోగానందగారు క్రియాయోగ ప్రక్రియను అభ్యసించడానికి ఉపదేశం ఇచ్చారు. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా అందించే ఆ పవిత్ర ఉపదేశం (సంస్కృతంలో దీక్ష) విద్యార్థి మరియు పరమహంస యోగానందగారి మధ్య గురుశిష్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది.
ఒక సద్గురువు భౌతిక శరీరంలో నివసించనప్పటికీ ఎప్పటికీ సజీవంగా ఉంటాడు. భగవంతుని సర్వవ్యాపకత్వం మరియు సర్వజ్ఞత్వంతో తన ఏకత్వం ద్వారా, సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడి గురించి తెలుసుకుంటూ, అతడికి లేదా ఆమెకు నిరంతరం ప్రేమ మరియు రక్షణనిచ్చి గమనిస్తుంటారు.
పరమహంస యోగానంద — వై.ఎస్.ఎస్. గురు పరంపరలో చివరివారు
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. గురు పరంపరలో తానే చివరి గురువుగా ఉండాలనేది భగవదేచ్ఛ అని తన దేహత్యాగానికి ముందు పరమహంస యోగానందగారు తెలియజేశారు. తరువాత వచ్చిన ఏ శిష్యుడూ/శిష్యురాలూ లేక నాయకుడూ ‘గురువు’ అనే పాత్రను పోషించరు.మత చరిత్రలో ఈ రకమైన దివ్య ఆజ్ఞ అసాధారణమేమీ కాదు. సిక్కు మత సంస్థాపకుడైన గొప్ప సంత్ మహానుభావుడు గురునానక్ గతించిన తరువాత సాధారణంగా జరిగే గురు పరంపర ప్రారంభమయింది. అయితే ఆ పరంపరలో పదవ గురువు, తానే ఆ గురు పరంపరలో ఆఖరి వాడినని, అప్పటి నుండి బోధనలే గురువుగా భావించబడాలని ప్రకటించాడు.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అనే తాను స్థాపించిన సంస్థ ద్వారా తన పని కొనసాగిస్తానని పరమహంసజీ వాగ్దానం చేశారు. “నేను గతించిన తరువాత, నా బోధనలే మీకు గురువు…. ఈ బోధనల ద్వారా మీరు నాతోనూ, నన్ను పంపిన మహా గురువులతోనూ అనుసంధానంలో ఉంటారు,” అని ఆయన పేర్కొన్నారు.
తదుపరి అన్వేషణ
- ది గురు: మెసెంజర్ ఆఫ్ ట్రూత్ (ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది)
- ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ట్రూ గురు (ఇంగ్లీష్లో అందుబాటులో ఉంది)