వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు శ్రీ శ్రీ స్వామి చిదానంద గిరి భారతదేశంలో అడుగుపెట్టారని, తన నెల రోజుల భారత పర్యటనను ప్రారంభించడానికి జనవరి 22న నోయిడా ఆశ్రమానికి చేరుకున్నారని మీకు తెలియజేయడం మాకు చాలా సంతోషాన్ని కలుగచేస్తోంది. ఆయనతో పాటు ఎస్.ఆర్.ఎఫ్. కు చెందిన స్వామి కమలానంద కూడా ఉన్నారు.
స్వామి చిదానందగారి పర్యటన సందర్భంగా, హైదరాబాద్ లో నిర్వహించిన ఒక ప్రత్యేక ఐదు రోజుల కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ప్రసంగాలు మరియు ధ్యానాలకు ఆయన అధ్యక్షత వహించారు. వై.ఎస్.ఎస్. సంగమం 2023 ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, మరియు ఆ కార్యక్రమాలు ఇప్పటికీ వీక్షించడానికి అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో స్వామీజీ పర్యటనకు సంబంధించిన ఫోటోలను మీతో ఇక్కడ పంచుకోవడం మాకెంతో సంతోషాన్ని కలుగజేస్తోంది.
శ్రీరాంపూర్ తీర్థయాత్ర ప్రదేశాలు
పరమహంస యోగానందుల గురువు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారితో సంబంధం ఉన్న రెండు తీర్థయాత్రా ప్రదేశాలను అభివృద్ధి చేసే ప్రణాళికల గురించి హైదారాబాద్ లో ఉన్నప్పుడు స్వామి చిదానందగారు ఆనందకరమైన ప్రకటన చేశారు.
వీటిలో మొదటిది గంగా నది ఒడ్డున ఉన్న మర్రిచెట్టుకి సంబంధించినది. ఇది శ్రీరాంపూర్ లోని శ్రీయుక్తేశ్వరుల ఆశ్రమానికి కొద్ది దూరంలో ఉన్నది. 1894లో దీని క్రింద ఆయనను మహావతార్ బాబాజీ కలిశారు (ఒక యోగి ఆత్మకథ లో వివరించినట్లుగా).
ఈ పవిత్రమైన మర్రిచెట్టు నుండి నదికి వెళ్ళే ప్రదేశం యొక్క నిర్వహణ బాధ్యతను వై.ఎస్.ఎస్. తీసుకోవడం జరిగింది మరియు దాని నిర్వహణను కొనసాగించేందుకు శ్రీరాంపూర్ మున్సిపాలిటీతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆ మర్రిచెట్టు ప్రక్కనే ఉన్న రెండు పెద్ద భవనాలను కూడా వై.ఎస్.ఎస్. సమకూర్చుకోవడం జరిగింది. అవతార పురుషులైన బాబాజీ అక్కడ శాశ్వతంగా వదిలిన ప్రకంపనల అనుభూతిని భక్తులు పొందేందుకు తగిన ధ్యాన వాతావరణాన్ని కల్పించడానికి తగిన సమయంలో ఈ ప్రదేశం కోసం వై.ఎస్.ఎస్. ప్రణాళికలను అభివృద్ధి చేస్తుంది.
పవిత్రమైన మర్రి చెట్టు క్రింద గుమికూడిన భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వామి చిదానందగారు.
స్వామి శ్రీయుక్తేశ్వరుల స్మృతి మందిరం, శ్రీరాంపూర్.
స్వామి శ్రీయుక్తేశ్వరుల స్మృతి మందిరంలోని పూజా వేదిక వద్ద మోకరిల్లుతున స్వామి చిదానందగారు.
స్వామి శ్రీయుక్తేశ్వరుల పవిత్ర ఆశ్రమంలో సహచరులతో కలసి ధ్యానం చేస్తున్న స్వామి చిదానందగారు.
రెండవ ప్రదేశం, శ్రీరాంపూర్ లోని స్వామి శ్రీయుక్తేశ్వరుల ప్రధాన ఆశ్రమానికి సంబంధించినది, ఇక్కడ పరమహంసగారు తన జీవితాన్ని పరివర్తన చేసిన ఆధ్యాత్మిక శిక్షణను పొందడం జరిగింది. దీని గురించి ఆయన ఒక యోగి ఆత్మకథ లోని “గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం” అనే అధ్యాయంలో వివరించడం జరిగింది.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా అనేక సంవత్సరాలుగా ఈ ఆశ్రమ ఆస్తిలోని కొంత భాగంలో స్మారక మందిరాన్ని (పైన చూపబడింది) నిర్వహిస్తోంది. స్వామి శ్రీయుక్తేశ్వరుల ఈ స్మృతి మందిరాన్ని 1977లో వై.ఎస్.ఎస్. వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా శ్రీ మృణాళినీమాత అంకితం చేశారు.
ఆశ్రమ ఆస్తికి సంబంధించిన సంపూర్ణ యాజమాన్య హక్కులను వై.ఎస్.ఎస్. సొంతం చేసుకొంది. ఈ గొప్ప గురువుల శాశ్వత ప్రకంపనలతో నిండిన తీర్థయాత్రా ప్రదేశాన్ని ఆధ్యాత్మిక అన్వేషకులకు అందుబాటులో ఉంచడానికి అసలైన ఆశ్రమ భవనాన్ని సాధ్యమైనంత వరకు పునరుద్ధరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది.
శ్రీరాంపూర్ లోని ఈ రెండు పవిత్ర తీర్థయాత్రా ప్రదేశాలకు సంబంధించిన సవివరమైన ప్రణాళికలను సరైన సమయంలో మీకు తెలియచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం.
నోయిడా ఆశ్రమంలో సత్సంగం
వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమంలో ఫిబ్రవరి 26న “క్రియాయోగం యొక్క పరివర్తక శక్తి” అనే అంశంపై వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు స్వామి చిదానంద గిరి గారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి దాదాపు 1,400 మంది భక్తులు మరియు స్నేహితులు హాజరయ్యారు.
క్రియాయోగ శాస్త్రాన్ని క్రమబద్ధంగా, అంకితభావంతో, నిరంతరాయంగా, భక్తితో సాధన చేసినప్పుడు కలిగే పరివర్తన శక్తిని గురించి స్వామీజీ ప్రసంగించారు.
తన భారతదేశ పర్యటన చివరి దశలో స్వామీజీ నోయిడాలో పాల్గొన్నారు.
నోయిడాలో స్వామి చిదానందగారి సత్సంగంలోని కొన్ని ముఖ్య సన్నివేశాలు:
భక్తి గీతాలను ఆలపిస్తున్న స్వామి కమలానంద.
“క్రియాయోగం యొక్క పరివర్తక శక్తి” అనే అంశంపై స్వామి చిదానందగారు స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కూడా చేయబడింది.
స్వామీజీ ప్రసంగాన్ని అత్యంత శ్రద్ధతో ఆలకిస్తున్న కొంతమంది భక్తులు.
దాదాపు 1400 మంది భక్తులు మరియు స్నేహితులు ఈ ప్రసంగానికి హాజరయ్యారు.
ఆధ్యాత్మిక మహాగ్రంథం ఒక యోగి ఆత్మకథ యొక్క హిందీ హార్డ్ కవర్ సంచికను విడుదల చేస్తున్న స్వామీజీ.
ప్రసంగం తరువాత హాలులో ఉన్న భక్తులకు అభివాదం చేస్తూ వెళుతున్న స్వామీజీ.
యోగదా సత్సంగ మఠం సందర్శన, దక్షిణేశ్వరం
హైదారాబాద్ లో జరిగిన సంగమంలో పాల్గొన్న తరువాత, స్వామి చిదానందగారు దక్షిణేశ్వరంలోని యోగదా సత్సంగ మఠానికి ప్రయాణించారు. ఫిబ్రవరి 19, 2023 ఆదివారం నాడు ఒక ప్రత్యేక సత్సంగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెందిన కొన్ని చిత్రాలను మీతో పంచుకోవడం మాకు ఆనందాన్ని కలిగిస్తోంది.
గురుదేవుల చిత్రపటానికి ప్రణామాలు సమర్పిస్తున్న స్వామి చిదానందగారు.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న స్వామీజీ…
....వై.ఎస్.ఎస్. భక్తులు, వారి కుటుంబాలు మరియు స్నేహితులు దీనిలో పాల్గొనడం జరిగింది.
క్రియాయోగ ప్రాముఖ్యత గురించి ప్రసంగిస్తున్న స్వామీజీ.
ప్రధాన మండపం నిండిపోవడంతో పెంచిన సభాస్థలిలో కూర్చొని ప్రసంగాన్ని వీక్షిస్తున్న భక్తులు.
జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సరైన దృక్పథాన్ని అభివృద్ధి చేసుకోవడం గురించి వివరిస్తున్న స్వామీజీ.
దాదాపు 800 మంది భక్తులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
సత్సంగం తరువాత, హాజరయినవారికి వ్యక్తిగతంగా అభివాదం చేస్తున్న స్వామీజీ...
...మరియు వారికి ప్రసాదాన్ని అందజేశారు.
వై.ఎస్.ఎస్. సంగమం 2023లో పాల్గొనేందుకు హైదారాబాద్ పర్యటన
రాంచీలోని యోగదా సత్సంగ మఠం సందర్శన తరువాత, స్వామి చిదానందగారు కాన్హా శాంతి వనంలో జరిగిన వై.ఎస్.ఎస్. సంగమం 2023లో పాల్గొనేందుకు ఫిబ్రవరి 10, 2023న హైదరాబాద్ చేరుకున్నారు. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు గురుదేవుల బోధనలలోని జ్ఞాన ముత్యాలను భక్తులతో పంచుకొని, 3-గంటల ప్రత్యేక సామూహిక ధ్యానాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 16న స్వామీజీ ముగింపు సత్సంగం నిర్వహించారు. సంగమ అనుభవాన్ని భక్తులు తమతో ఎలా కొనసాగించవచ్చో ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.
దయచేసి కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను క్రింద చూసి ఆనందించండి.
తన ఆగమనం సందర్భంగా కార్యక్రమ వేదిక వద్ద ఘన స్వాగతం పొందిన స్వామి చిదానందగారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమ వేదిక వద్ద సంగమంలో పాల్గొన్నవారికి మరియు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా పాల్గొన్నవారికి అభివాదం చేస్తున్న స్వామీజీ.
ప్రధాన ప్రాంగణంలో స్వామీజీ యొక్క జ్ఞానదాయక ప్రసంగం.
శక్తిపూరణ వ్యాయామాలను సామూహికంగా అభ్యసిస్తున్న భక్తులు.
సంగమం భక్తులకు 3-గంటల దీర్ఘ ధ్యానాన్ని స్వామీజీ నిర్వహించారు. ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
ధ్యానిస్తున్న కొంతమంది భక్తులు.
వై.ఎస్.ఎస్. పుస్తక విక్రయశాల వద్ద స్వచ్ఛంద సేవకులకు అభివాదం చేస్తున్న స్వామీజీ...
...మరియు క్రియా నమోదు విభాగం.
ముగింపు సత్సంగంలో ప్రసంగిస్తున్న స్వామీజీ...
...సంగమం యొక్క అనుభవాన్ని ఇంటివరకు ఎలా కొనసాగించాలనే జ్ఞానాన్ని స్వామీజీ ఇందులో పంచుకున్నారు.
అద్భుతమైన సంగమానికి వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. తరఫున స్వామీజీకి కృతజ్ఞతలు తెలుపుతున్న భక్తులు.
భక్తులకు అభివాదం చేస్తున్న స్వామీజీ...
...ముగింపు సత్సంగం తరువాత మధ్య మార్గంలో నడుస్తున్న స్వామీజీ.
స్వామీజీని మళ్ళీ చూడాలనే ఆనందకరమైన ఆశతో వీడ్కోలు చెబుతున్న భక్తులు.
సంగమంలో ప్రత్యక్ష ప్రసారమైన కార్యక్రమాలన్నిటినీ వీక్షించడానికి దిగువనున్న బటన్ మీద క్లిక్ చేయండి.
వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో స్వామి చిదానందగారి సత్సంగం
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు ఫిబ్రవరి 5న వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో సత్సంగం నిర్వహించారు. ఇందులో 800 మంది వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. భక్తులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ సమావేశమైన వారికోసం స్వామీజీ ఒక నిర్దేశిత ధ్యానాన్ని నిర్వహించి, నిష్క్రమించే వారందరికీ వ్యక్తిగతంగా ప్రసాదం అందజేసి నమస్కరించారు.
ఫిబ్రవరి 5, 2023న స్వామి చిదానందగారు ఒక నిర్దేశిత ధ్యానంతో పాటు స్ఫూర్తిదాయక సత్సంగాన్ని నిర్వహించారు.
స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు...
అనంతరం సత్సంగాన్ని నిర్వహించారు.
రాంచీలోని ఇతర ఆశ్రమాలకు చెందిన సన్యాసులు, సన్యాసినులు మరియు వివిధ హోదాలలో ఉన్నవారితో పాటు సుమారు 800 మంది హాజరయ్యారు.
“ఆధ్యాత్మిక మార్గంలో ఉత్సాహాన్ని కొనసాగించడం” అనే అంశంపై స్వామీజీ ప్రసంగించారు...
అనంతరం సభికుల కోసం దివ్య సంకల్పాన్ని నిర్వహించారు.
మరియు ఒక నిర్దేశిత ధ్యానాన్ని నిర్వహించారు.
మాతృకా ఆశ్రమానికి చెందిన ఒక సన్యాసినికి అభివాదం చేస్తున్న స్వామీజీ...
మరియు రాంచీలోని అద్వైత స్వరూప ఆశ్రమ సన్యాసులతో.
స్వామీజీకి నమస్కరించి, ఆయన ఆశీస్సుల కోసం ముందుకు వస్తున్న భక్తులు.
వ్యక్తిగతంగా ఆశీస్సులిస్తున్న స్వామి చిదానందగారు...
సత్సంగం అనంతరం హాజరయినవారికి ప్రసాదం అందజేయడం జరిగింది.
బాలల సత్సంగం సందర్భంగా చిన్నారులను దీవిస్తున్న స్వామీజీ.
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అధ్యక్షులను కలిసిన తరువాత సంతోషం మరియు ఆనందంతో ఉప్పొంగుతున్న ఒక భక్తుడు.
యోగదా సత్సంగ విద్యా సంస్థ ఆవరణలో నూతన సౌకర్యాల అంకిత కార్యక్రమం — జగన్నాథ్పూర్ (రాంచీ)
వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. యొక్క పూజ్యనీయ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి స్వామి చిదానందగారు జనవరి 29న రాంచీలోని జగన్నాథ్పూర్లో యోగదా సత్సంగ విద్యావరణలో నూతన సదుపాయాలను అంకితం చేశారు. 1,100 మంది పైగా హాజరైన ఈ చిరస్మరణీయ కార్యక్రమంలో రాంచీ విద్యా సంస్థలకు చెందిన సభ్యులు, వై.ఎస్.ఎస్. సన్యాసులు మరియు భక్తులు, వై.ఎస్.ఎస్. విద్యాసంస్థ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే నూరు సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ గురించి వివరించే ఒక చిన్న వీడియో కూడా ప్రదర్శించబడింది.
ప్రాచీన గురుకుల సూత్రాలకు అనుగుణంగా నాడు శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన పాఠశాల మాదిరిగా, ప్రకృతి సాన్నిధ్యంలో అభ్యాసన వంటి అత్యాధునిక సౌకర్యాలను రూపొందించారు. వాటిలో తరగతి గదులు, ప్రయోగశాలలు, సమావేశ మందిరం మరియు పరిపాలనా భవనం ఉన్నాయి. ఈ ఆధునిక పాఠశాల ప్రాంగణాన్ని ముఖ్యంగా సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులు వినియోగించుకుంటారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలోని కొన్ని ఫోటోలను ఈ క్రింద వీక్షించండి.
స్వామి చిదానందగారికి స్వాగతం పలుకుతున్న విద్యార్థులు.
సభలో స్వామీజీ ప్రార్థన నిర్వహించారు.
అనంతరం బహుళార్ధ హాలు శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
విరాళమిచ్చిన ఒక భక్తుడికి గురుదేవుల చిత్రాన్ని అందజేస్తున్న స్వామి చిదానందగారు.
సభను ఉద్దేశించి స్వామి చిదానందగారు ప్రసంగించారు.
నూతన యోగదా సత్సంగ విద్యాలయ సముదాయం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్వామి చిదానందగారు.
నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాల సదుపాయాలను స్వామి చిదానందగారు సందర్శించారు.
ప్రారంభోత్సవానికి ముందు కీర్తనలు గానం చేస్తున్న స్వామి వాసుదేవానంద.
బహుళార్ధ హాలు ముఖచిత్రం.
సరస్వతీ వందనం గానం చేసిన విద్యార్థులు.
అతిథులకు స్వాగతం పలుకుతున్న యోగదా విద్యా సంస్థల ఛైర్మన్ స్వామి సుద్ధానంద.
హాజరైనవారిలో కొంతమంది.
ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకరించిన వారందరికీ స్వామి విశ్వానంద కృతజ్ఞతలు తెలిపారు.
స్వామి స్మరణానంద కృతజ్ఞతలు తెలిపారు.
తరగతి గదుల విభాగం యొక్క దృశ్యం.
తరగతి గది దృశ్యం.
పాఠశాల నూతన పరిపాలనా భవనం.
రాంచీ సందర్శన
స్వామి చిదానందగారు జనవరి 24, 2023 సాయంత్రం, రాంచీలోని యోగదా సత్సంగ శాఖా మఠం చేరుకున్నారు. రాంచీలో స్వామీజీ నివసించే సమయంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారు ఇక్కడకు వచ్చినప్పటి కొన్ని ఫొటోలను మీతో మేము పంచుకుంటున్నాం.
భారతదేశంలో స్వామీజీ ఆగమనం
స్వామీజీ రాక సందర్భంగా ఢిల్లీ విమానాశ్రయం మరియు వై.ఎస్.ఎస్. నోయిడా ఆశ్రమం వద్ద స్వాగతం చెబుతున్న కొన్ని చిత్రాలను మీతో పంచుకోవడం మాకు సంతోషాన్ని కలుగచేస్తోంది.