శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి 125వ జయంతి సందర్భంగా అక్టోబర్ 29, 2019న, గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రత్యేక స్మారక నాణెం విడుదల చేశారు. ఈ విశేషమైన కార్యక్రమంపై మా ప్రారంభ వార్తా కథనానికి అదనంగా, వై.ఎస్.ఎస్. నుండి కొనుగోలు చేయడానికి ఇప్పుడు భారతదేశంలో నాణాలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. (మేము ఈ నాణాన్ని విదేశాలకు విక్రయించలేము లేదా రవాణా చేయలేము, ఎందుకంటే భారతదేశం వెలుపల స్మారక నాణేల అమ్మకం లేదా ఎగుమతిని భారత ప్రభుత్వం అనుమతించదని దయచేసి గమనించగలరు).
నాణెం గురించి
ప్రముఖంగా కనిపించే నాణెం ముఖ పైభాగంలో భారతదేశ చిహ్నంతో పరివేష్ఠమై హిందీలో “భారత్” మరియు “ఇండియా” అని ఆంగ్లంలో ఉంది. దాని క్రింద 125వ జన్మదిన వార్షికోత్సవ విషయం’తో సమానంగా “₹ 125” అని నాణెం యొక్క విలువ ఉంది. నాణానికి వెనుక వైపు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి అత్యంత గుర్తించబడిన చిత్రం ఉంది. చిత్రం చుట్టూ హిందీ మరియు ఆంగ్లంలో “పరమహంస యోగానందగారి 125వ జన్మదినోత్సవం” అనే పదాలు ఉన్నాయి.
పరిచయ వివరణ
నాణెం అందమైన సేకరణ కవరులో వచ్చింది, ఇందులో పరమహంస యోగానందగారి జీవితం మరియు కార్యం గురించి సంక్షిప్త వివరణ ఉంది, హిందీ మరియు ఆంగ్లం రెండింటిలోనూ అందించబడింది. నాణెం సేకరించేవారి కోసం, నాణెం యొక్క ఖనిజాల కూర్పు యొక్క జాబితా చేర్చబడింది.
ధర:
భారతదేశంలో ₹ 5,000 (రవాణా మరియు ప్యాకేజింగ్తో సహా)రవాణా:
నాణెం భారతదేశంలో మాత్రమే రవాణా చేయబడుతుంది. ఆర్డర్ ఇచ్చిన 5-7 రోజుల్లో పంపించడం జరుగుతుంది. (కోవిడ్-19 పరిస్థితి కారణంగా, కొన్ని ప్రాంతాలలో బట్వాడా ఆలస్యం కావచ్చు)ఎలా ఆర్డర్ చేయాలి:
మీరు ఈ నాణాన్ని ఆన్లైన్లో వై.ఎస్.ఎస్. బుక్స్టోర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు.125వ జయంతి వార్షికోత్సవం సందర్భంగా భద్రపరచబడిన సమాచారం
- పరమహంస యోగానందగారి స్మారక నాణెం విడుదల చేసిన ఆర్థిక మంత్రి
- పరమహంస యోగానందగారి 125వ జయంతి వార్షికోత్సవాన్ని నిర్వహించిన భారత ప్రభుత్వం
- పరమహంస యోగానందగారి 125వ జన్మదిన వార్షికోత్సవం – స్వామి చిదానంద గిరి గారి సందేశం.
- పరమహంస యోగానందగారి 125వ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించబడిన కార్యక్రమాలు
- సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మద్దతుతో ప్రజల కొరకు సత్సంగాలు నిర్వహించబడ్డాయి